7, ఏప్రిల్ 2020, మంగళవారం

***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 07.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు, శ్రీ శివలంక ఉదయభాస్కర్ గారు , శ్రీ ముదిగొండ లింగమూర్తి గారు, శ్రీ ముదిగొండ నాగరాజు గారు, శ్రీ ముదిగొండ నాగేశ్వర రావు గారు మరియు శ్రీమతి రాధ గార్ల బృందం   కలసి సుమారు 600 ప్యాకెట్స్**  బిసిబేళ్లబాత్**  తయారు చేయించినారు.

 మ౹౹ 12.30 ని!!లకు   150 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది. 
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 100 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయగా...., సుమారు 200 ఆహార ప్యాకెట్స్ మన సభ్యులందరూ అశోకనగర్,  చిక్కడపల్లి, మరియు హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో  పేదలకు పంపిణి చేయడమైనది.

విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు 
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి